Saturday, June 28, 2008

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు

దోపిడీలొనూ హైటెక్ పద్ధతులు - రాష్ట్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు ప్రభుత్వం తన దోపిడీ విధానానికి హైటెక్ పద్ధతులను ఆచరించటానికి తయారయ్యింది. ఇక భూముల వేలం " ఆన్ లైన్" లో నిర్వహిస్తుందట. దీని వలన పారదర్శకత పెరుగుతుందట. విదేశాలలో ఉన్నవారు సైతం వేలంలో పాల్గొనవచ్చునట.ఇవన్నీ ప్రభుత్వం వైపునుండి వినిపిస్తున్న వాదాలు. అయితే అసలు విషయం వేరన్నది తలకాయలో కాస్త బుద్ధి ఉన్న వాళ్ళెవరైనా గ్రహిస్తారు. టెండరు ప్రక్రియ వలన కాలయాపన జరిగే అవకాశం ఉంది. ప్రతి పక్షాలు అడ్డుకొనే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో అమ్మాల్సిన భూములు చాలా ఉన్నాయి. కాని తమ వద్ద ఉన్న కాలం తక్కువ. ఏ సమయంలోనైనా ఎన్నికలు రావచ్చు. దీని వలన తమ ఆశయాలు నెరవేరక పోవచ్చు. ఇవన్నీ ప్రభుత్వం భయాలు. అందుకే ఈ హైటెక్ దోపిడీకి తహ తహ. వీలైనన్ని భూములమ్మి డబ్బు దోచుకోవాలి. ఆ డబ్బులో కొంత భోంచేయవచ్చు. కొంత రాబోయే ఎన్నికల ఖర్చుకి పనికొస్తుంది. ఐటితో ఎన్నిలాభాలో.

విపక్షాలు తాము కూడా హైటెక్ పద్ధతిలోనే అడ్డుకుంటామని అంటున్నాయి. మరి వాళ్ళ హైటెక్ వ్యూహం ఏమిటో!

ఇదంతా చూస్తూ ఉంటే నిజంగానే వైస్ చెప్పినట్టు త్వరలోనే మన రాష్టం ఐటిలో నెంబర్ వన్ స్థానంలో నిలవడం ఖాయంగా కనిపిస్తొంది! శుభం!!

1 వ్యాఖ్యలు:

oremuna said...

విపక్షాలు మంచి హ్యాకర్లను రిక్రూట్ చేసుకోవాలేమో :)