Monday, June 23, 2008

వార్తలు - వ్యాఖ్యలు


పాపం చిరంజీవి!
చిరంజీవి రాజకీయ ప్రవేశం కాకుండానే అతనిపై ఆరోపణల పర్వం ఆరంభమైంది.వైఎస్ మంత్రులు మారెప్ప, గీతారెడ్డి ఆయనపై దుమ్మెత్తిపోయడం ప్రారంభించేరు. బ్లడ్ బేంకుతో సమాజసేవ అని చెప్పి అభిమానుల రక్తంతోటి ధనార్జన చేస్తున్నాడని, భూములు కబ్జా చేసాడని ఇంకా అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఇదంతా అధినాయకుని ప్రొత్సాహంతోనే జరుగుతున్నాదని చిరంజీవి అభిమానులు మండిపడుతున్నారు. యధాశక్తి వాళ్ళ దిష్టిబొమ్మలు తగలెట్టి నాయకునియందు తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు."అందరినీ కలుపుకు పోవాలి" అనే పిసిసి అద్యక్షుడు, ఎందుకేనా మంచిదనే ముందుచూపుతో కాబోలు వారిని వారించే ప్రయత్నం చేసారు. ఇప్పుడే ఇలాఉంటే ముందు ముందు తన ఇమేజ్ ఏమవుతుందో అని మెగాస్టారు ఆరాటపడటం సహజం. ఆయనకు దిశానిర్దేశం చేసే పెద్దలు ఇటువంటివి ఎలా ఎదుర్కోవాలని ఆలోచనలో పడ్డారని వినికిడి. జనంచేత జేజేలు కొట్టించుకోవడమే తెలిసిన చిరు రాజకీయలు ఇంకా వంట పట్టించుకోవసివుంది. "దున్నపోతుమీద జడివాన పడితే" అదెలా దులుపుకు పోతుందో ఆ స్వభావం బాగా జీర్ణించుకున్న మిగతా పార్టీల నాయకులను చూసి నేర్చుకోవలసి ఉంది. తప్పవు నాయనా ఇవన్నీ రాజకీయాలలో!

0 వ్యాఖ్యలు: