Showing posts with label jagan. Show all posts
Showing posts with label jagan. Show all posts

Monday, July 14, 2008

అయ్యో పాపం పసివాడు

సాక్షి దినపత్రికలో ఆదివారం ఏసుక్రీస్తును కించపరిచేలా ఉన్న చిత్రం ప్రచురితం కావడంపై రాష్ట్రవ్యాప్తంగా క్రైస్తవులు నిరసన వ్యక్తంచేశారు. ఒకచేతిలో సిగరెట్టు, మరోచేతిలో మద్యం గ్లాసు ఉన్నట్లు ఏసుక్రీస్తు చిత్రాన్ని ప్రచురించడం క్రైస్తవులను అవమానించేలా ఉందని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ క్రైస్తవ సంఘాలు సాక్షిపై ఆగ్రహం వ్యక్తంచేశాయి. వెంటనే పత్రిక ఛైర్మన్‌ జగన్‌ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశాయి.పత్రిక ఛైర్మన్‌ జగన్‌ దిష్టిబొమ్మను తగులబెట్టారు.కొన్ని చోట్ల సాక్షి కార్యాలయాలను ధ్వంసం చేసారు.

అసలే వైస్ పైన గుర్రుగా ఉన్న "ప్రజా శాంతి పార్టీ" వ్యవస్థాపకుడు కె.ఆనంద్‌పాల్‌ గారు "తప్పుచేసిన వారికి క్షమించే గొప్పగుణం ప్రభువుకు ఉందని, అయితే ప్రభువు ఆత్మను కించపరిచినా, క్షోభపెట్టిన వారికి క్షమాపణ లేదనే విషయాన్ని బైబిల్‌ స్పష్టం చేసిందన్నారు. ఇది పొరపాటుగా నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రభువును ఒక వ్యసనపరుడిగా చిత్రించడం క్షమించరాని మహాపరాధంగా పేర్కొన్నారు. మందకృష్ణ మాదిగ దిష్టిబొమ్మను దగ్ధం చేసినందుకు ఆంధ్రజ్యోతి యాజమాన్యం, విలేకరులపై కేసులు పెట్టారని, ఇప్పుడు కోట్ల మంది క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసిన సాక్షి పత్రిక ఎండీని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. "

"ప్రభువా! క్షమించు" అంటూ పత్రికాధిపతి జగన్ సాక్షి 14వ తేదీ పత్రికలో వాపోయాడు.
తాజా వార్త ఏమిటంటే, తెలుగుదేశం ఎస్.సి సెల్ జగన్ పైన, మిగిలిన సాక్షి సంబంధిత అధికారులపైనా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు.

ఇదంతా చూస్తూ ఉంటే ఆనాడు, ఈ జగన్ పైసాచికానందంతో ఆంధ్రజ్యోతిపై విసిరిన విసుర్లు జ్ఙాపకం వస్తున్నాయి. ఆనాడు ఈ వైస్ పుత్రుడు "బాడుగ నేతలు అంటూ దళితుల మనోభావాలు దెబ్బతీసినందుకే ఈ పరిస్థితి వచ్చింది. పత్రికలు మనం రాస్తున్న వార్తలు సరైనవేనా అని ప్రశ్నించుకోవాలని "అన్నాడు. ఇంకా ముందుకు పోయి "ఒకరిపై బురద జల్లే హక్కు మనకు లేదని, ఉన్నది ఉన్నట్లు రాయటమే మన భాద్యతని ఆయన పత్రికలకు నీతులు చెప్పేడు. మరి వీరు ఉన్నది ఉన్నట్టే చూపేరా? కళ్ళుమూసుకొనే కదా ఈ పని చేశారు! ఇది గురివింద గింజ సామెతలా ఉంది. అసలు తనేంటో, ఈ వైభవం వెనుక కధేంటో ప్రభువు సన్నిధిలో ప్రశ్నించుకోవాలి.

పసివాడా! అయ్యో పాపం పసివాడా! ఎరక్కపోయి అన్నావే ఇరుక్కుపోయావే!